YouTube channel subscription banner header

వ్యాన్‌ను ఢీకొన్న బస్సు.. 15 మంది మృతి, 13 మందికి గాయాలు

Published on

జాతీయ రహదారిపై వెళుతున్న ఓ వ్యాన్‌ను ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో అదుపు తప్పిన బస్సు వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 15 మంది మృతిచెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 93వ జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ప్రమాదానికి గురైన వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారు హాథ్రస్‌ నుంచి ఆగ్రా వైపు వెళుతున్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో నలుగురు మహిళలు, మరో నలుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుకు తగిన సాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతులకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...