YouTube channel subscription banner header

అనకాపల్లి ఎంపీ సీటుపై జగన్‌ సస్పెన్స్‌.. వ్యూహాత్మకంగానే..

Published on

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వ్యూహాత్మకంగానే ఆయన సీటును పెండింగ్‌లో పెట్టినట్లు అర్థమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాతనే జగన్‌ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సిఎం రమేష్‌ను బరిలోకి దించే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం. అయితే, సిఎం రమేష్‌ విశాఖపట్నం సీటును ఆశిస్తున్నారు. విశాఖ సీటు ఇచ్చేది లేదని బీజేపీ నాయకత్వం ఆయనకు తెగేసి చెప్పినట్లు సమాచారం.

అనకాపల్లి సీటు కోసం వైఎస్‌ జగన్‌ కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదారి ఆనంద్‌ సోదరి పీల రమాదేవి, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సన్నిహిత అనుచరుడు బొద్దెడ ప్రసాద్‌, బొద్దేటి కాశి విశ్వనాథ్‌ పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని అభ్యర్థిని కూడా అనకాపల్లిలో ఆయన రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...