YouTube channel subscription banner header

టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికలో గందరగోళం

Published on

వచ్చే ఎన్నికలలో టికెట్ల కోసం టీడీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరో వైపు వైసీపీ చాలా దూకుడుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాహసోపేతంగా అభ్యర్థులను మారుస్తూ, బలమైన అభ్యర్థులతో టికెట్లను ఖరారు చేస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు.
స్థానిక నాయకుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. టికెట్ల కోసం పోటీ పెరగడంతో, స్థానిక నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి.

జగన్ మాత్రం అత్యంత సాహసోపేతంగా అభ్యర్థులను మారుస్తున్నారు. సిట్టింగ్‌లను కూడా పక్కన పెట్టి గెలుపు గుర్రాలను నిలిపే ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ-జనసేన కూటమిని సమర్థంగా ఎదుర్కోవడానికి ముందస్తుగానే వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ, జనసేనలు మాత్రం వైసీపీ నుంచి వ‌చ్చే వలస నేత‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. టికెట్‌ దక్కనివారు పార్టీ మారడం సహజం. వైఎస్‌ జగన్ వ‌ద్ద‌నుకుని పక్కన పెట్టి నాయకులు వస్తుంటే ఆ పార్టీలు ఆబగా అందుకుని టికెట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి.

వైసీపీ అభ్యర్థులు దూకుడుగా ప్రజల్లోకి వెళ్తుంటే, టీడీపీ-జనసేన కూట‌మి అభ్యర్థుల ఎంపికలో జాప్యం చేస్తూ వస్తోంది. సీట్ల సర్దుబాటు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో స్థానికంగా ఇరు పార్టీల నాయకుల మధ్య సమన్వయం సాధించడం అంత సులభమైన విషయం కాదనే మాట వినిపిస్తోంది.

పుట్టపర్తి: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జనసేన నాయకుడు శివశంకర్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.
కదిరి: కందికుంట వెంకట ప్రసాద్‌పై నకిలీ డీడీల కేసు ఉండడంతో, ఆయన భార్య యశోదమ్మకు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌లు వస్తున్నాయి.
ధర్మవరం: పరిటాల శ్రీరామ్‌కు టికెట్‌ ఖాయమని భావించినప్పటికీ, బిజెపి నుంచి వరదాపురం సూరి పోటీ పడే అవకాశం ఉంది.
మడకశిర: ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించడంతో, టీడీపీ అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది.

అయితే.. టీడీపీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కార్యకర్తలలో అసంతృప్తికి దారితీస్తుంది. పార్టీ మారడాలు పెరిగే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన కూటమికి ఎన్నికల్లో ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన నాయకత్వం వెంటనే స్పందించి, సీట్ల సర్దుబాటును ఖరారు చేయడంతో పాటు, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతను పాటించాలి. లేకపోతే, వైసీపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...