ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పిల్లలకు చేయలేనటువంటి మంచిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని చెప్పాలి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పిల్లలకు ఓట్లు లేవు కదా వారికి మంచి చేస్తే మనకి ఏమొస్తుంది అనుకున్నాయి. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడి జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తించారు. అందుకే పిల్లల బంగారు భవిత కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయిని సామాజిక పెట్టుబడిగా చూశారు.
జగన్ అధికారం చేపట్టిన తరువాత విద్య రంగంలో ఎన్నో మార్పులు చేశారు. విద్యారంగం అభివృద్ధి కోసం చిన్నపిల్లల మొదలు విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం భోజనం పథకం, జగనన్న అమ్మబడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి స్కీమ్స్ను అమలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యను ప్రైవేటీకరణ చేశారు. కేవలం తనకు అనుకూలంగా ఉన్న చైతన్య, నారాయణ విద్యాసంస్థలను లాభాల బాటలో నడిపించడం కోసమే చంద్రబాబు నాయుడు వారికి ఊడిగం చేశారు. కానీ జగనన్న అలా చేయలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు అని నమ్మి.. పేద పిల్లల చదువు కోసం విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. సర్కారు బడులను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు.
గిరిజన విద్యా సంస్థలను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. పాఠశాలలను జగన్ ప్రభుత్వం ఆధునికీకరించింది. వాటిలో 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది.