YouTube channel subscription banner header

పెళ్లింట విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు హైద‌రాబాదీల దుర్మ‌ర‌ణం

Published on

పెళ్లి బాజాలు మోగి వారం తిర‌క్కుండానే ఆ ఇంట్లో మ‌ర‌ణ మృదంగం మోగింది. కుమారుడి పెళ్లి చేసి, స‌కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్ర‌మాదం క‌బ‌ళించింది. నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఐదుగురు హైద‌రాబాద్ వాసులు దుర్మ‌ర‌ణం పాల‌య్య‌రు.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా దారుణం
సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ త‌న కుమారుడు బాల‌కిరణ్‌కు గ‌త నెల 29న గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం చేశారు. ఈ నెల 3న శామీర్‌పేట‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ నిర్వ‌హించారు. 4న కొత్త జంట‌ను తీసుకుని కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగివస్తుండగా నంద్యాల జిల్లా ఆళ్ల‌గడ్డ మండ‌లం నల్లగట్ల హైవేపై లారీని వీరి కారు ఢీకొట్టింది.

కొత్త జంట‌తో స‌హా కుటుంబ‌మంతా బ‌లి
ఈ ప్ర‌మాదంలో కారు బ‌లంగా లారీని ఢీకొట్ట‌డంతో ర‌వీంద‌ర్‌, ఆయ‌న భార్య ల‌క్ష్మి, పెళ్లి కుమారుడు బాల‌కిర‌ణ్‌, కోడలు కావ్య‌, మ‌రో కుమారుడు ఉద‌య్‌కిర‌ణ్ తీవ్ర‌గాయాల‌పాలై అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...