టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేకనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని గీతాంజలి భర్త బాలచందర్ ఆరోపించారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వమని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని ఆయన అన్నారు. వీడియోలో మాట్లాడినప్పుడు చాలా ఆనందపడిందని, ఆ వీడియోకు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్కు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదని ఆయన చెప్పారు.
తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోన్ చూస్తూ ఏడుస్తూనే ఉందని, ఇంకా ఎవరికీ ఇటువంటి ఇబ్బందులు రాకూడదని చివరకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని ఆయన చెప్పారు. ఒక మహిళ మీద ఇటువంటి ట్రోలింగ్ చేస్తారా, వాటిని తట్టుకోలేక ఆమె తమకు దూరమైందని అన్నారు. ట్రోల్స్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారిని పోలీసులు గుర్తించారు. వారిలో కొంత మంది పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. గీతాంజలి మరణంతో తెనాలిలో విషాద వాతావరణం నెలకొంది.