YouTube channel subscription banner header

చంద్రబాబు చెప్పారు.. జగన్ చేసి చూపించారు..!

Published on

చంద్రబాబుది అంతా మేకపోతు గాంభీర్యమే. ఏదీ చెయ్యకపోయినా అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ నానా హడావిడి చేస్తాడు. ఆయన చెప్పేదంతా ప్రచారం వరకే ఆగిపోతుంది. ఆయన హయాంలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పేరుతో తెగ ప్రచారం చేశారు. కానీ.. అది ప్రచారం దగ్గరే ఆగిపోయింది. దాంతో స్టార్టప్‌ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు(startups) ఉండగా, అవి ప్రస్తుతం 586కి పెరిగాయి. స్టార్టప్‌ల సంఖ్య దాదాపు మూడింత‌లు పెరిగడం విశేషం.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్‌షిప్‌, ఫండింగ్‌, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో అనిల్‌ తెంటు చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ4కి చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను కూడా జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏ హబ్‌, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్‌ జోన్‌లోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు తయారవుతున్నాయి. చంద్రబాబులా ప్రచారాలకే పరిమితం కాకుండా… స్టార్టప్స్ కంపెనీలకు జగన్ అండగా నిలుస్తున్నారు. ఆయన ప్రోద్బలంతో మరిన్ని స్టార్టప్స్ అంకురించడానికి సిద్ధమౌతున్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...