YouTube channel subscription banner header

పవన్‌పై కాపుల తిరుగుబాటు.. జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు

Published on

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై సొంత సామాజికవర్గం కాపు నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తాజాగా తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనసేనకు నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు మాత్రమే కేటాయించడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏపీలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్న, పవన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్న కాపు సామాజికవర్గాన్ని అవమానించేలా జనసేనకు 24 సీట్లు కేటాయించారని మండిపడుతున్నారు కాపు నేతలు. సీట్ల సంఖ్య పెంచకుంటే టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసే ప్రసక్తే లేదంటున్నారు. కనీసం 50 స్థానాలకు తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్‌ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తారంటూ మండిపడుతున్నారు. పి.గన్నవరంలో గతంలో జనసేనకు 34 వేల ఓట్లు వచ్చాయని…అలాంటి చోట వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టిన మహాసేన రాజేష్‌కు టికెట్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు.

తెలుగుదేశం తీరును నిరసిస్తూ ఇప్పటికే పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి కాపు కుల సంఘాలు. భవిష్యత్‌ కార్యచరణపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు కాపు నేతలు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...