YouTube channel subscription banner header

గీతాంజలి ఉదంతం.. బయటపడిన వాస్తవం.. పచ్చ బ్యాచ్‌ ఆగడాలతోనే…

Published on

గీతాంజలిని ఇద్దరు వ్యక్తులు రైలు కిందికి తోసేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. గీతాంజలి మరణంపై జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌ ఇచ్చిన వాంగ్మూలం అసలు విషయాన్ని బయటపెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రశంసించినందుకు ఆమెను సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేసి నోటితో పలకడానికి కూడా వీలుకాని భాషలో వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆ విషయాన్ని మరుగుపరచడానికి పచ్చ బ్యాచ్‌ కొత్త డ్రామాకు తెర తీసింది. ఆమెను ఇద్దరు వ్యక్తులు రైలు కిందికి తోసేశారని ఫేక్‌ వీడియోను తెర మీదికి తెచ్చింది. అయితే, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌ ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగు చూసింది.

గుంటూరు నుంచి 12.05 గంటల సమయంలో తెనాలి స్టేషన్‌కు దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకు ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాక్‌ పక్కన నిలబడిన యువతి ఒక్కసారి ట్రాక్‌పైకి వచ్చిందని, తప్పుకోవాల్సిందిగా అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేశానని, అయితే అప్పటికే రైలు ఇంజన్‌ ఆమెకు తగిలిందని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌ విజయ్‌రామ్‌ జీఆర్‌పీ పోలీసులకు అప్పుడే వాంగ్మూలం ఇచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ప్రయాణికుల సాయంతో రైలు ఎక్కించి తెనాలి స్టేషన్‌లో స్టేషన్‌ మాస్టర్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు.

వాస్తవం అది కాగా, టీడీపీ సోషల్‌ మీడియాలో గీతాంజలి ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు తోసేసి పారిపోయినట్లుగా ఒక వీడియోలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు చూపిస్తూ తప్పుడు వీడియోను సర్క్యులేట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని ఎడిట్‌ చేసి వదిలినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ వీడియోను సర్క్యులేట్‌ చేసింది ఎవరనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...