జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రజలను అవమానించారు. రాయలసీమలో రౌడీలే ఉంటారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అక్కసుతో ఆయన రాయలసీమ ప్రజలను అవమానించారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ జగన్ను రాయలసీమ ప్రజలు అభిమానిస్తుండడం ఆయనకు మింగుడు పడని విషయంగా మారింది. రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం వారు చేసిన పనులే వారి పట్ల అభిమానాన్ని పెంచాయనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు చెందినవారే అయినా ఆయన ఆ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు.
చితూర్తు ఎమ్యెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ కల్యాణ్ రాయలసీమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను రౌడీరాజ్యంగా ఆయన చిత్రించే ప్రయత్నం చేశారు. రాయలసీమలో వైసీపీ బలంగా ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే ఇక రాయలసీమ గురించి మరిచిపోవచ్చునని ఆయన అన్నారు. ఉద్యోగాల నిమిత్తం అందరూ గల్ఫ్, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు.
తెలంగాణవాళ్లతో మళ్లీ తిట్టించుకోండని ఆయన అన్నారు. జగన్ గుంపు నుంచి రాయలసీమను కాపాడుకోలేకపోతే మనుషులెవరూ ఉండరని ఆయన అన్నారు. జగన్పై బురద చల్లడానికి ఆయన రాయలసీమపై నోరు పారేసుకున్నారు.