టీడీపీ విడుదల చేసిన రెండు లిస్టుల్లోనూ వంగవీటి రాధా పేరు లేదు. మరోవైపు జనసేన పొత్తులో తమకు దక్కిన అవనిగడ్డ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో రాధా జనసేన మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి బాలశౌరితో ఆయన నివాసంలో భేటీ కావడం, వీరిద్దరూ గంటపాటు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు రాధా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ను కలిసి కూడా మాట్లాడారు.