YouTube channel subscription banner header

సెలవే వారికి శాపమైంది.. వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

Published on

భారీ వర్షాల వల్ల పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్గ‌మ‌ధ్య‌లోని వాగులో కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సినవారు తిరిగిరాని లోకాలకు చేరిపోయారు.

నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించడంతో తన గ్రామానికే చెందిన ఇద్దరు విద్యార్థులు మానిక్, సాత్విక్‌లను తీసుకొని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఉప్పలపాడు సమీపంలోకి వచ్చేసరికి మురుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులో ఉన్న విద్యార్థులు, సాత్విక్, మానిక్‌ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...