బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు. యాత్ర తర్వాత వైసీపీ బలగం పెరిగిపోయింది. కీలక కూటమి నేతలు కూడా అధికార పార్టీలో చేరేందుకు ఆరాట పడుతున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని స్పష్టం అవుతోంది. 35 రోజుల్లో ఏకంగా 250 మంది కీలక కూటమి నేతలు వైసీపీలో చేరారు. లక్షా 5 వేల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు అధికార పార్టీలోకి వచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమికి గట్టి డ్యామేజ్ అయింది. గోదావరి జిలాల్లోనూ జనసేనను జగన్ యాత్ర ఊడ్చేసింది.
తాజాగా ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లో పలువురు కీలక నేతలు చేరారు. గాజువాక నియోజకవర్గం బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు. పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.