YouTube channel subscription banner header

ఏ ప్యాకేజీ కోసం తల వంచారో పవన్‌ చెప్పాలి – మంత్రి రోజా

Published on

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 24 సీట్లలో మాత్రమే పోటీ చేసేందుకు పొత్తు పెట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడని మంత్రి రోజా ప్రశ్నించారు. 24 సీట్లకే తోక ఊపుకుంటూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నావా.. అంటూ ఎద్దేవా చేశారు. శనివారం మంత్రి రోజా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన ముష్టి 24 సీట్ల కోసం ఎందుకు తల వంచారో పవన్‌ చెప్పాలన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు ముందు పవన్‌ ఎందుకు తల వంచారో జనసైనికులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్‌ లేని పవర్‌ స్టార్‌ ఒక వైపు జగనన్నను ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని మంత్రి చెప్పారు.

ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టీడీపీ తరపున చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్‌ మంగళగిరి నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారని మంత్రి రోజా గుర్తు చేశారు. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేసేదీ ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. ఒక స్థానంలో ఓడిపోయిన వారికి మొదటి జాబితాలో, రెండు స్థానాల్లో ఓడిపోయినవారికి రెండో జాబితాలో పేరు ఇస్తారేమోనని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...