YouTube channel subscription banner header

పవన్ అహంకారమే తనని దెబ్బ కొడుతోందా.. అయినా మార్పు రాదా?

Published on

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలు పైన అవుతుంది. ఇప్పటివరకు ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఇలా 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ డిపాజిట్లు కోల్పోతున్నారు అంటే అందుకు కారణం లేకపోలేదు. త‌న‌ అహంకారమే తనని రాజకీయంగా దెబ్బతీస్తుందనే విషయాన్ని పవన్ గుర్తించలేకపోవటం గమనార్హం.

ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి తనతో విభేదించేవారిని కూడా తనతో నడిపించగలగే సత్తా ఉండాలి. కానీ ఈయన మాత్రం నా మాటే శాసనం నేను చెప్పినదే వినాలి అంటూ కార్యకర్తలకు, నేతలకు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఎప్పుడు తను చెప్పినట్టే వినాలని పార్టీలో ఏకాభిప్రాయమే ఉండాలి కానీ భిన్నాభిప్రాయాలు ఉండకూడదన్న ధోరణిలో పవన్ ఉంటున్నారు.

ఇక ఏదైనా సభలలో ఈయనకు మైక్ చేతికి చిక్కితే కుప్పిగంతులు వేస్తుంటారు, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంటారు. ఆయన వేదికలపై ఏం మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియదు. మాట మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అహంకారం అని మాట్లాడుతారు. అసలు అహంకారం గురించి పవన్ మాట్లాడటం వింటే అందరికీ నవ్వు వస్తుంది. ఒంటినిండా అహంకారంతో పిచ్చివాగుడువాగే పవన్ కు రాజకీయ పరిణితి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి ఆయన అహంకారం గురించి మాట్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను చులకన చేసి మాట్లాడే నైజం పవన్‌ది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అది కూడా బలంగా ఉన్న స్థానాలలో కాకుండా బలహీనంగా ఉన్నటువంటి స్థానాలలో కేవలం 24 సీట్లను సొంతం చేసుకోవటం ఆయన రాజకీయ పరిపక్వతను చాటి చెబుతోంది. అయితే తానొక్కడినే పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నానన్న అహంకారం తనలో ఎక్కువగా ఉంద‌ని, అదే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారుతుందనే విషయాన్ని పవన్ గ్రహించాల్సి ఉందని పలువురు ఆయ‌న‌ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...