మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. సింగిల్గా వస్తే చితకబాదుతామని, ఇద్దరుగా వస్తే విసిరికొడతామని, ముగ్గురు కలిసొస్తే విసిరి సముద్రంలో ముంచేస్తామని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్తో కలిసి ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చేసిన ఈ వ్యాఖ్యలు సిద్ధం సభను దద్దరిల్లేలా చేయడం గమనార్హం.
సీఎం జగన్ మొనగాడని, చంద్రబాబు మోసగాడని అంబటి తెలిపారు. 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు తన హయాంలో చేసిన మేలు ఒక్కటీ లేదు. చంద్రబాబు `రా.. కదలి రా` అంటే ఎవరూ రావడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని పొత్తునూ ఉద్దేశిస్తూ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్న మొనగాడు జగనన్న అయితే.. 14 ఏళ్లు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని.. మీకు మొనగాడు కావాలా? మోసగాడు కావాలా? అంటూ మంత్రి అంబటి సభలో ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.
ప్రతి విషయంలో ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు ధైర్యం లేదని అంబటి తెలిపారు. అందుకే దత్తపుత్రుడితో కలిసి వస్తున్నారని, ఇప్పుడు బీజేపీని కలుపుకొని వస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఏమీ చేయలేరన్నారు. వాళ్లది జెండా సభ కాదని.. జెండా ఎత్తేసే సభని ఎద్దేవా చేశారు.