YouTube channel subscription banner header

ఆపరేషన్‌ గరుడ.. విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Published on

విశాఖ తీరంలో డ్రగ్స్‌ కలకలం రేగింది. సీబీఐ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్‌ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి ఇంటర్‌పోల్ సమాచారం అందించింది. ఈ సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్‌ను సీజ్ చేశారు.

బ్రెజిల్‌లోని సాంటోస్‌ పోర్ట్‌ నుంచి ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. డ్రై ఈస్ట్‌లో మిక్స్‌ చేసి విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీకి 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం డ్రగ్స్‌గా గుర్తించారు అధికారులు.

ఇప్పటికే సరఫరా చేసిన వారితో పాటు ప్రైవేట్ కంపెనీ వ్యక్తులపై FIR నమోదు చేశారు అధికారులు. ఇతర పదార్థాలలో కలిపి డ్రగ్స్ సరఫరా చేయడం వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందని సీబీఐ ఆరోపించింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...