టాలీవుడ్ హీరో రాజ్తరణ్, లావణ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో రాజ్తరుణ్కు బిగ్షాక్ ఇచ్చారు పోలీసులు. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు రాజ్తరుణ్ను నిందితుడుగా చేర్చారు. లావణ్యతో రాజ్తరుణ్ పదేళ్లపాటు సహజీవనం చేసిన మాట నిజమేనని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్తరుణ్ – లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని స్పష్టం చేశారు. లావణ్య ఇంట్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు పోలీసులు.
రాజ్తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని నార్సింగి పోలీస్స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనతో పదేళ్లు సహజీవనం చేశాడని, ఇప్పుడు తనను కాదని ముంబైకి చెందిన హీరోయిన్తో ఉంటున్నాడని లావణ్య ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు సమర్పించింది. ఐతే రాజ్తరుణ్ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో బెయిల్ కోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇక లావణ్య, రాజ్తరుణ్ల కేసు అనేక మలుపులు తీసుకుంది. 2016లో గర్భం దాలిస్తే.. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. మెడికల్ రిపోర్ట్సును సైతం పోలీసులకు ఇచ్చినట్లు చెప్పింది. ఈ కేసులో లావణ్య తరఫున కల్యాణ్ దిలీప్ సుంకర వాదనలు వినిపిస్తున్నారు. లావణ్య, రాజ్తరుణ్లకు సంబంధించిన అనేక ఆడియో కాల్స్ సోషల్మీడియాలో వైరల్గా మారాయి. రాజ్తరుణ్ మాత్రం లావణ్య ఆరోపణలను ఖండిస్తున్నారు.