YouTube channel subscription banner header

కేంద్ర ప్ర‌భుత్వ‌ సాయంపై గందరగోళం!

Published on

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సాయంపై గందరగోళం నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల కోసం కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల చేసిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసిందనేది రూమర్ మాత్రమేనన్నారు. ఇప్పటివరకూ కేంద్రానికి నివేదిక కూడా పంపలేదన్నారు చంద్రబాబు. రేపు ఉదయం కేంద్రానికి తొలి నివేదిక ఇస్తామన్నారు చంద్రబాబు.

https://x.com/TeluguScribe/status/1832072258652713222

అంతకుముందు బుడమేరు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు గండ్లను పూడ్చే పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ కూడా వచ్చిందని, శనివారం నాటికి బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర కిట్ల పంపిణీని రేపటి నుంచి వేగవంతం చేస్తామన్నారు.

ఇక కేంద్ర ప్ర‌భుత్వ సాయంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురందేశ్వరి మరోలా ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు నిధులు విడుదల చేసిందంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించినందుకు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఓ వైపు చంద్రబాబు ఎలాంటి నిధులు విడుదల కాలేదని చెబితే…బీజేపీ నేత పురందేశ్వరి నిధులు విడుదలయ్యాయంటూ ట్వీట్ చేయడం గందరగోళానికి దారి తీసింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...