YouTube channel subscription banner header

జగన్‌ని పొగిడినా జీర్ణించుకోలేరా రామోజీ..!

Published on

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అక్కసు వెళ్లగక్కడంలో ఈనాడు రామోజీరావు ఎప్పుడూ ముందుంటారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా ఏదో ఒక విధంగా తక్కువ చేసి చూపించాలని అనుకుంటారు. ఇప్పటి వరకు అలాంటివి చాలానే చేశారు. కానీ, ఎవరైనా జగన్‌ని పొగిడినా కూడా కనీసం జీర్ణించుకోలేరా అనే విషయం తాజాగా తెలిసింది.

ఇంతకీ విష‌యం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ను చులకన చేస్తూ ఈనాడులో ఓ కథనం రాశారు. ఆయనను అలా చులకన చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన జగన్ గొప్పతనం గురించి మాట్లాడటమే. యువతకు ప్రేరణ కలిగించే ఉద్దేశంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం సాయంత్రం నిక్‌ వుజిసిక్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. అయితే.. ఈనాడులో మాత్రం ఓ కాగితం చూసి ఏకబిగిన మూడు నిమిషాలు జగన్‌ గురించి గొప్పలు చెప్పుకుంటూ పోయారు అంటూ ఆయన ప్రసంగాన్ని తక్కువ చేస్తూ రాశారు.

ముఖ్యమంత్రి జగన్‌ తనకు, దేశానికి, ఎంతో మంది యువతకు ఆదర్శమని, విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నారని, పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటు, ఇంగ్లీష్‌లో మీడియంలో బోధన, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన విజన్‌ గొప్పది అని నిక్‌ వుజిసిక్‌ అన్నారు. దీనికి రామోజీరావు వక్రీకరిస్తూ కథనం రాయడం గమనార్హం. తన ప్రియ శిష్యుడు చంద్రబాబును ఎవరైనా ప్రశంసిస్తే రామోజీరావు ఇదే విధమైన కథనాలు ఎప్పుడైనా రాయించారా అంటే శూన్యం అనే చెప్పొచ్చు.

నిజానికి, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణల వల్ల పేదలు, దళితుల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి వీలవుతోంది. సంపన్న వర్గాల పిల్లలతో సమానంగా విద్యను అందుకుని ప్రపంచస్థాయిలో వారితో పోటీ పడే అవకాశం కలుగుతోంది. ఎంతో ముందుచూపుతో మరో పదేళ్లలో దళితులు, పేదలు సాధికారితను సాధించడానికి వీలుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, సంక్షేమ పథకాలను కూడా జగన్‌ అమలు చేస్తున్నారు. అది సహించలేకనే రామోజీరావు నిక్‌ వుజిసిక్‌ మీద కూడా తమ అక్కసును వెళ్లగక్కారు అని స్పష్టంగా అర్థమౌతోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...