YouTube channel subscription banner header

సీఎం జగన్‌పై రాళ్ల‌ దాడి.. కన్నుకు గాయం

Published on

మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో ఏపీ సీఎం జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జ‌గ‌న్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్తుండ‌గా రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. ఈ దాడిలో ఓ రాయి జగన్‌ ఎడమ కనుబొమ్మకు తాకి గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు జగన్‌కు బ‌స్సులోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు.

సీఎం జగన్‌పై క్యాట్‌బాల్‌తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్‌. జగన్‌పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు చేపిస్తున్నారని మండిపడుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...