YouTube channel subscription banner header

నేను గేట్లు తెరిస్తే.. రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on

తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఎవరూ ఉండరని, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్‌లో కేవలం ఆ నలుగురు మాత్రమే మిగులుతారన్నారు. అనవసరంగా మాతో గోక్కోవద్దంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. తనతో పెట్టుకున్నవాళ్లేవరూ ఇంతవరకు బాగు పడలేదన్నారు.

మణుగూరు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి…బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి అంటూ విమర్శించారు. ప్రజా పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంటే KCR ఫ్యామిలీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని.. అవగాహనతోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...