YouTube channel subscription banner header

బాబుతో ఆ మాట చెప్పించగలవా..? పవన్‌కి హరిరామజోగయ్య ప్రశ్నలు

Published on

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో జోగయ్య పవన్‌కు పలు కీలక ప్రశ్నలు సంధించారు. కాపులు పవన్‌ వెంట వచ్చేది చంద్రబాబు అధికారం కోసం కాదని ఆయ‌న‌ స్పష్టం చేశారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లు పవన్‌ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని డిమాండ్‌ చేశారు.

పవన్‌ రెండున్నరేళ్లు సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించాలని జోగయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్‌ల భేటీపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలను జోగయ్య ఖండించారు. జనసేన 40 నుంచి 60 సీట్లలో పోటీ చేయాలని ఆయ‌న‌ సూచించారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారబోస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడతామని చంద్రబాబు నోటి వెంట ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా అని జోగయ్య తన లేఖలో నిలదీశారు.

జోగయ్య లేఖ చంద్రబాబు, పవన్‌ల మధ్య పొత్తుపై సందేహాలను లేవనెత్తింది. జనసేనలో సీట్ల పంపకంపై చర్చకు తెరతీసింది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో అన్న‌ది ఆసక్తికరంగా మారింది. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...