YouTube channel subscription banner header

హరీష్ రావు..! ఇది పద్ధతి కాదు

Published on

తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత పోలీస్ శాఖ పనితీరు పూర్తిగా రివర్స్ అయిందనేది బీఆర్ఎస్ ఆరోపణ. తమ హయాంలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, కాంగ్రెస్ రాగానే గాడి తప్పాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో నేరుగా పోలీసులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలను పోలీస్ శాఖ కూడా నిశితంగా గమనిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం నేతలు. దురుద్దేశంతో ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు.

తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి, తెలంగాణ పోలీసుల పనితీరు తెలిసి కూడా హరీష్ రావు ఇలా విమర్శలు చేయడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం నేతలు. తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే సమర్థవంతమైన విభాగంగా పేరుందని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం మధ్యలో పోలీసులను ఇరుకున పెట్టాలని చూడటం సరికాదన్నారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. హరీష్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఓ లేఖ విడుదల చేసింది.

గతంలో కూడా తెలంగాణ పోలీసులపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు జరిగాయని విమర్శించారు. 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేశారని, బీహార్ నాటు తుపాకులు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు హరీష్ రావు. మహిళలకు భద్రత కరువైందని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలన్నారు. గతంలో తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ హరీష్ రావు చేసిన విమర్శలకు వెంటనే బదులిచ్చారు అధికారులు. తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీస్ శాఖ అత్యంత నిబద్ధతతో పనిచేస్తుందని, నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడబోమమని వారు అన్నారు. తాజాగా పోలీస్ అధికారుల సంఘం హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పోలీసుల మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం పద్ధతి కాదన్నది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...