YouTube channel subscription banner header

జగన్ విద్యా సంస్కరణలకు మేధావులు ఫిదా..!

Published on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలపై మేధావులు ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన “ప్రగతిపథంలో రాష్ట్ర విద్యా విధానం” అనే అంశంపై సదస్సులో పాల్గొన్న మేధావులు రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలను కొనియాడారు.

సదస్సులో ముఖ్యంగా చర్చించిన అంశాలు

అందరికీ నాణ్యమైన విద్య అందిస్తున్నారని మెచ్చుకున్నారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం చైర్మన్ హెచ్. లజపతిరాయ్, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న కృషిని బలపరిచారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎం. జగన్నాథరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తూ దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పిల్లలకు సాంకేతిక, నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి కేంద్రీకరించారని ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ కె. శ్రీరామమూర్తి కొనియాడారు. జగన్ ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి ఆవల ఉన్న సామాజిక వర్గాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల పాఠశాల హాజరు గణనీయంగా పెరిగిందని ఏయూ విద్యా శాఖ అధిపతి టి. షారోన్ రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటులో దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు రిటైర్డ్ ప్రొఫెసర్ పి. విశ్వనాథం, సిహెచ్. సూర్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ సి. వెంకటరావు ప్రభుత్వాన్ని అభినందించారు.

21వ శతాబ్దానికి సిద్ధం..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణల ద్వారా విద్యార్థులు 21వ శతాబ్దంలోకి గర్వంగా అడుగుపెట్టడానికి అవసరమైన ప్రామాణిక ప్రగతిని, జ్ఞానాభివృద్ధిని, నైపుణ్యాలను అందిస్తోందని మేధావులు కొనియాడారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...