YouTube channel subscription banner header

జగన్ దెబ్బకు.. తగ్గిన టీడీపీ ఊపు..!

Published on

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. ఆయన నిర్వహిస్తున్న సిద్ధం సభలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఈ సిద్ధం(siddham) సభల దెబ్బకు టీడీపీకి ఊపు తగ్గిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలి రా(raa kadali raa) సభలు అయితే తేలిపోతున్నాయి. ఇప్పటి వరకు జగన్ రెండు సిద్ధం సభల్లో ప్రసంగించారు. వ్యూహాత్మకంగా భీమిలి, ఏలూరులను సిద్ధం సభలకు వేదికలుగా ఎంచుకున్నారు. ఆ రెండూ బాగా క్లిక్ అయ్యాయి. మరిన్ని సిద్ధం సభల్లోనూ జగన్ ప్రసంగించనున్నారు. అవి కూడా ప్రజలను ఆకట్టుకుంటాయనే నమ్మకం వైసీపీ నేతల్లో బలంగా ఉంది.

కానీ.. జగన్ సభల దెబ్బకు చంద్రబాబుకి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. జగన్‌ కన్నా ముందే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ‘రా.. కదలిరా..’ అనే పేరుతో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. కానీ, వైఎస్‌ జగన్‌ సిద్ధం అంటూ ప్రజల్లోకి రాగానే చంద్రబాబు `రా.. కదలిరా..` తేలిపోయినట్లు కనిపిస్తోంది.

సిద్ధం అంటూ ప్రజల్లోకి రావడం వైఎస్‌ జగన్‌లోని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. ‘నేను సిద్ధం.. మీరు సిద్ధమా’ అంటూ ఆయన అంటున్నారు. ఇది ప్రతిపక్షాలకు సవాల్‌ విసురుతున్నట్లుగానూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది. అదే చంద్రబాబు ‘రా… కదలిరా.. ’ అనేది విజ్ఞప్తిలాగా, ఓట్ల కోసం బతిమిలాడుతున్నట్లుగా అనిపిస్తోంది. పైగా ‘రా.. కదలిరా..’ అనేది పాత ఐడియా. దీన్ని బహుశా ఎన్‌టీఆర్‌ 1983 ప్రాంతంలో వాడిననట్లు గుర్తు.

సిద్ధంలో కొత్త ఆలోచనా ధోరణి కనిపిస్తుండగా, రా.. కదలిరా అనేది పాత రికార్డులాగా అనిపిస్తోంది. బహుశా జగన్‌ ప్రజల ముందుకు రాకముందే తాము వెళ్లాలనే హడావిడిలో చంద్రబాబు దాన్ని ఎంపిక చేసుకుని ఉంటారు. ఏది ఏమైనా జగన్ సభలకు మాత్రం రాష్ట్రంలో క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రేజ్‌ని మ్యాచ్ చేయడం చంద్రబాబు తరం అయ్యేలా కనిపించడం లేదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...