YouTube channel subscription banner header

చ‌దువుల‌కు మ‌రింత ఊతమిస్తున్న కళ్యాణమస్తు, షాదీ తోఫా

Published on

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. అందుకోసం పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి అభివృద్ధికి పాటుపడుతున్నారు. ముఖ్యంగా పేదలను దృష్టి పెట్టుకొని వారికి సహాయం అందిస్తూ వస్తున్నారు. అలాంటి సంక్షేమ ప‌థ‌కంలో ఒక‌టైన `వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా`ద్వారా ఇప్పటి వరకు ఎంత మంది లబ్ధి పొందారో ఓసారి చూద్దాం..

అక్టోబర్ – డిసెంబర్‌ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ తోఫా కింద ఇప్పటి వరకు మొత్తం 56,194 మంది లబ్ధిదారులకు రూ.467.27 కోట్లు అందించారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో 17,709 మంది అర్హులకు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా వదిలేశారు. జగన్‌ ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఆర్థిక సాయాన్ని దాదాపుగా రెండింతలు చేసి అందిస్తోంది.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి, తమ సామాజిక బాధ్యత నిర్వహించేందుకు అండగా నిలుస్తూ… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణ‌మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా జగన్‌ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు పదవ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించిన జగనన్న ప్రభుత్వం…చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది, 1వ తరగతి నుండి ఏటా అందిస్తున్న రూ.15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తుండటంతో వారికి 17 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుంది. జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్థిక సాయం ఎలాగూ అందిస్తుండడంతో వారు గ్రాడ్యుయేషన్‌లో చేరుతారన్న నమ్మకంతో పాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట వేస్తుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద లబ్ధిదారులకు అందించిన సాయం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
ఎస్సీ(కులాంతర వివాహం)ల‌కు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
ఎస్టీ(కులాంతర వివాహం)ల‌కు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,20,000
బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
బీసీ(కులాంతర వివాహం)ల‌కు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000
మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాల‌కు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000
విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000
భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000

జమ చేసిన తేదీ(10.02.2023): లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. కోట్లలో 38.18 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్ – డిసెంబర్ 2022)
జమ చేసిన తేదీ(05.05.2023): లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 87.32 (వివాహం జరిగిన త్రైమాసికం జనవరి-మార్చి 2023)
జమ చేసిన తేదీ(09.08.2023): లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ. కోట్లలో 141.60 (వివాహం జరిగిన త్రైమాసికం ఏప్రిల్-జూన్ 2023)
జమ చేసిన తేదీ(23.11.2023): లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. కోట్లలో 81.64 (వివాహం జరిగిన త్రైమాసికం జులై-సెప్టెంబర్ 2023)
జమ చేసిన తేదీ(20.02.2024): లబ్ధిదారులు 10,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 78.53 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023)

ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌థ‌కం కింద 56,194 మందికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందించిన ఆర్థిక‌ సాయం రూ. 427.27 కోట్లు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...