YouTube channel subscription banner header

రేవంత్‌ ప్రజా పాలనకు ఇదే నిదర్శనం – కేటీఆర్

Published on

సీఎం రేవంత్‌ రెడ్డి పాలనపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబ్‌నగర్‌లో వికలాంగులు,పేదల ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్న కేటీఆర్.. బుల్డోజర్లే పరిష్కారమని నమ్మే మూర్ఖపు పాలనకు ఈ చిత్రాలే నిదర్శనమంటూ మండిపడ్డారు.

మహబూబ్‌నగర్‌లో తెల్లవారుజామున 3 గంటలకు దళిత కాలనీలోని 75 ఇళ్లను రేవంత్ సర్కార్‌ నేలమట్టం చేసిందని మరోసారి గుర్తుచేశారు. ఇందులో దాదాపు 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవని, వారంతా బలవంతంగా తమ ఇళ్లలో నుంచి నెట్టివేయబడడం విషాదకరమన్నారు.

మహబూబ్‌నగర్‌లో కూల్చివేతలకు సంబంధించి మొత్తం 4 ఫొటోలను తన ట్విట్టర్‌లో పంచుకున్నారు కేటీఆర్. నాలుగు ఫొటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ ఫొటోలకు బుల్డోజ్ తెలంగాణ, కాంగ్రెస్‌ ఫేయిల్డ్‌ తెలంగాణ హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు కేటీఆర్.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...