YouTube channel subscription banner header

రాయలసీమలో 90 శాతం పైగా స్థానాలు మావే – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published on

రాయలసీమలో 90 శాతం పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పం, పిఠాపురంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను ఓడించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. పుంగనూరు మున్సిపాలిటీలో సోమవారం ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ మేనిఫెస్టోలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇచ్చారని మంత్రి చెప్పారు. తమ మేనిఫెస్టో ప్రజలందరి ఆమోదం పొందుతున్నదని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి జూన్‌ తర్వాత రెండోసారి జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని ఆయన చెప్పారు.

రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి నైతికత లేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో అసెంబ్లీలో కిరణ్‌ మాట్లాడుతూ.. తాను తెలంగాణ బిడ్డనని, ఇక్కడే జన్మించానని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు ఏపీలో పోటీ చేయడం హాస్యాస్పదమని చెప్పారు. రాజంపేట ఎన్నికల్లో మిథున్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...