YouTube channel subscription banner header

పిల్లల్ని కూడా వదలరా..?

Published on

విజయవాడ వరద బాధితులకోసం ఏపీ ప్రభుత్వం విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విరాళాలిస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోని సీఎం చంద్రబాబు కూడా తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈరోజుకిది చాలు అనేట్టుగా ఆ వీడియో ఉందని, తనకెంతో తృప్తినిచ్చిందని చంద్రబాబు కామెంట్ కూడా పెట్టారు. నిజమైన రేపటి పౌరులు వీరేనంటూ పిల్లల్ని అభినందించిన చంద్రబాబు, పొరుగువారికి సాయపడాలనే బాధ్యతను నేర్పించిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు.

https://x.com/ncbn/status/1833090947632005346

అయితే చంద్రబాబు ఈ వీడియోని రాజకీయం కోసం వాడుకున్నారంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. నీ పబ్లిసిటీ పిచ్చిలో పిల్లల్ని కూడా వదలవా చంద్రబాబూ అంటూ వైసీపీ నుంచి ట్వీట్ పడింది. తల్లికి వందనం అంటూ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15,000 ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏదీ ఇవ్వకుండా నిండా ముంచేశావంటూ వైసీపీ బదులిచ్చింది. పిల్లల కోసం ఇస్తానన్న డబ్బు ఎగరగొట్టేసి, తిరిగి వారి దగ్గరే వసూళ్లు మొదలు పెట్టిన చంద్రబాబు.. ఇలాగే సంపద సృష్టిస్తారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

https://x.com/YSRCParty/status/1833171358139724253

వైసీపీ కౌంటర్ కి వెంటనే టీడీపీ బదులిచ్చింది. జగన్ ఉక్రోషం తట్టుకోలేక పోతున్నారని, ఇంతటి విపత్తులో రాష్ట్రం మొత్తం ఏకమవడం చూసి, ఏడుస్తున్నారని ట్వీట్ చేసింది. కులం, మతం, ప్రాంతంతో ప్రజల్ని విడగొట్టాలని జగన్ చూస్తుంటే, చంద్రబాబు అందర్నీ కలిపి ప్రేమతో ముందుకు వెళ్తారని చెప్పింది. పసి పిల్లల వీడియో చుట్టూ విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగడం ఏపీ పొలిటికల్ సీన్ కి అద్దం పడుతోందని అంటున్నారు నెటిజన్లు.

https://x.com/JaiTDP/status/1833187442830283112

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...