YouTube channel subscription banner header

బాబు ముందు మరో అరుదైన రికార్డు.. సోషల్‌ మీడియాలో పోస్టులు

Published on

ఏ పని చేసిన తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని, తానో విజనరీనని చంద్రబాబు చెప్పుకుంటారు. ఇక పచ్చమీడియా సైతం ఆయనకు వంత పాడుతుంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసింది తానొక్కడినేనని చంద్రబాబు తరచూ చెప్పుకుంటారు. అందులో నిజం లేకపోలేదు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో
జగన్‌ చేతిలో తెలుగుదేశం ఓడినప్పుడు ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది. అదేంటంటే..చంద్రబాబు ఓ అరుదైన ఘనత సాధించారని ఆ వార్త సారాంశం. వైఎస్సార్‌, జగన్ మోహన్‌ రెడ్డిల చేతిలో ఓడిపోయిన చంద్రబాబును కీర్తిస్తూ ఆ వార్తను రాశారు. తండ్రి, కొడుకులకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్న ఏకైక నేత చంద్రబాబు అంటూ గొప్పగా ఆ వార్త రాసుకొచ్చారు.

అయితే చంద్రబాబు మరో రికార్డును ఆయన సొంతం చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే అత్యంత ఎక్కువకాలం ప్రతిపక్షంలో ఉన్న నేతగా చంద్రబాబు రికార్డులకెక్కనున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగా..15 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే..మరో ఐదేళ్లు ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే. మొత్తంగా ఆయన 20 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి రికార్డులకెక్కనున్నారన్న మాట.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...