YouTube channel subscription banner header

జగన్‌పై ఎయిర్‌గన్‌తో దాడి… వైసీపీ అనుమానం

Published on

సీఎం జగన్‌పై దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్‌పై దాడి కేసులో ఆయన పలు అనుమానాలు, సందేహాలు లేవనెత్తారు. కొద్దిగా అటు, ఇటుగా తగిలితే కన్ను పోయే ప్రమాదం ఉందన్నారు. కణతకు తగిలి ఉంటే ప్రాణమే పోయేదన్నారు సజ్జల. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. ఎయిర్‌గన్‌తో దాడి చేసినట్లుగా ఉందని పలు సందేహాలను లేవనెత్తారు.

విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎడమ కంటికి కూడా గాయం అయిందన్నారు సజ్జల. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచారని చెప్పారు. ఈ ఘటన చాలా తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేశారు సజ్జల.

ఎవరో తుంటరి వాళ్లు, ఆకతాయిలు చేసి ఉంటే.. ఇంత పథకం ప్రకారం చేసి ఉండేవారు కాదన్నారు. జగన్‌కు తగిలిన రాయి కూడా దొరకలేదన్నారు సజ్జల. జగన్‌కు రాయి వచ్చి తగిలిన ప్రదేశం కూడా ఆందోళన కలిగించే అంశమేనన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...