సీఎం జగన్పై దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్పై దాడి కేసులో ఆయన పలు అనుమానాలు, సందేహాలు లేవనెత్తారు. కొద్దిగా అటు, ఇటుగా తగిలితే కన్ను పోయే ప్రమాదం ఉందన్నారు. కణతకు తగిలి ఉంటే ప్రాణమే పోయేదన్నారు సజ్జల. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు.. పక్కా ప్లాన్తో చేశారని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. ఎయిర్గన్తో దాడి చేసినట్లుగా ఉందని పలు సందేహాలను లేవనెత్తారు.
విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయం అయిందన్నారు సజ్జల. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పారు. ఈ ఘటన చాలా తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేశారు సజ్జల.
ఎవరో తుంటరి వాళ్లు, ఆకతాయిలు చేసి ఉంటే.. ఇంత పథకం ప్రకారం చేసి ఉండేవారు కాదన్నారు. జగన్కు తగిలిన రాయి కూడా దొరకలేదన్నారు సజ్జల. జగన్కు రాయి వచ్చి తగిలిన ప్రదేశం కూడా ఆందోళన కలిగించే అంశమేనన్నారు.