YouTube channel subscription banner header

చైనాను వణికిస్తున్న బెబింకా తుపాను

Published on

ఇటీవలే యాగీ తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టాలను చవిచూసిన చైనా.. తాజాగా బెబింకా తుపానుతో వణికిపోతోంది. 75 సంవత్సరాల తర్వాత ఈ తుపాను షాంఘై నగరాన్ని తాకడం గమనార్హం. 1949లో టైపూన్‌ గ్లోరియా తర్వాత షాంఘైని తాకిన తీవ్ర తుపాను ఇదే. సోమవారం ఉదయం చైనా ఆర్థిక నగరమైన షాంఘైని తాకిన ఈ తుపాను అతి బీభ‌త్సంగా విజృంభిస్తోంది. దీంతో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది.

గంటకు 151 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులతో నగరం వణికిపోతోంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించాల్సిన 1400 విమానాలు రద్దయ్యాయి. 570 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్‌ 3 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రానికి ఇది మరింత తీవ్రమవుతుందని అధికారులు ప్రకటించారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...