YouTube channel subscription banner header

తమ్ముళ్ళే జనసేన అభ్యర్థులా?

Published on

గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఏమైందో రేపటి ఏపీ ఎన్నికల్లో కూడా అదే జరగబోతోందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో జనసేన ఎనిమిది సీట్లకు పోటీ చేసిన విషయం తెలిసిందే. పేరుకు జనసేన ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసినా అందులో సుమారు నలుగురు బీజేపీ నేతలే. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలే జనసేనలో చేరి జనసేన అభ్యర్థులుగా పోటీ చేశారు.

ఇప్పుడు అచ్చంగా అలాంటి వ్యవహారాలే జనసేనలో మళ్ళీ రిపీటవుతున్నట్లు అనుమానంగా ఉంది. ఎలాగంటే ఒకపుడు టీడీపీలో యాక్టివ్‌గా పనిచేసిన తమ్ముళ్ళే రేపటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారట. టీడీపీ-జనసేన పొత్తులో జనసేన తరపున టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారని ఎప్పటినుంచో కొందరు మంత్రులు సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి వీరాంజనేయులు జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారట. పులపర్తి మీడియాతో మాట్లాడుతూ.. భీమవరం పర్యటనలో తన ఇంటికి పవన్ వచ్చినట్లు చెప్పారు. భీమవరంలో పోటీ చేసే విషయమై ఆడిగినట్లు చెప్పారు.

ఇప్పటివరకు భీమవరంలో పవనే పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. భీమవరం పర్యటనలో టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలబడాలని పవన్ అడగటంతో ఇక్కడ పవనే పోటీ చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. అయితే తర్వాత పులపర్తి ఇంటికి వెళ్ళిన పవన్ భీమవరంలో పోటీ విషయంలో ఆసక్తి ఉందాని అడిగారట. అయితే తాను పవన్నే పోటీ చేయమని చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. పవన్ పోటీ చేయకపోతే అప్పుడు తాను చేస్తానని చెప్పినట్లు పులపర్తి చెప్పారు.

అంటే బీమవరంలో పులిపర్తి పోటీ చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అలాగే పెందుర్తిలో పంచకర్ల రమేష్ కూడా మాజీ టీడీపీనే. కాకపోతే పంచకర్ల తెలివిగా టీడీపీలో నుండి నేరుగా జనసేనలో చేరకుండా వైసీపీలో చేరి తర్వాత జనసేనలో చేరారు. అంటే టీడీపీ టు జనసేన వయా వైసీపీ అన్నమాట. అలాగే తాడేపల్లిగూడెంలో పోటీ చేస్తారని అనుకుంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఒకపుడు టీడీపీ నేతే.

అలాగే యలమంచిలి ఇన్‌చార్జిగా ఉన్న సుందరపు విజయకుమార్ కూడా ఒకపుడు టీడీపీ నేతే. 2019లో తనకు టికెట్ దక్కదని అర్థ‌మై వెంటనే జనసేనలో చేరి పోటీ చేశారు. ఇపుడు కూడా జనసేన తరపున పోటీ చేయబోతున్నారు. జనసేన పోటీ చేయబోతున్న 24 సీట్లలో పవన్ ఐదుగురిని ప్రకటించారు. మిగిలిన 19 మందిని కూడా ప్రకటిస్తే అందులో ఎంతమంది తమ్ముళ్ళున్నారన్న విషయంలో క్లారిటి వచ్చేస్తోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...