YouTube channel subscription banner header

హైడ్రాకు చట్టబద్ధత.. త్వరలో ఆర్డినెన్స్

Published on

హైడ్రా చట్టబద్ధతపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నోటీసులు లేకుండా కూల్చివేతలేంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా విషయంలో ప్రభుత్వం మరింత పగడ్బందీగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు అభ్యంతరాలకు సమాధానం ఇస్తూనే హైడ్రాకు అదనపు అధికారాలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైడ్రాకోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ తేబోతోందని కమిషనర్ రంగనాథ్ స్వయంగా చెప్పడం విశేషం.

జీవో 99 ప్రకారం జులై 19న హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి, రంగనాథ్ ను కమిషనర్ గా నియమించారు. నెలల వ్యవధిలోనే హైడ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా హీరో నాగార్జున కు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా వార్తల్లోకెక్కింది. సీఎం రేవంత్ సోదరుడి భవనాలకు, టీడీపీ నేత మురళీ మోహన్ సంస్థకు నోటీసులిచ్చి సరిపెట్టిన హైడ్రా, నిరుపేదల ఇళ్లు, కొంతమంది విల్లాలను మాత్రం నోటీసుల్లేకుండా కూల్చేసింది. కోర్టు స్టే విధించినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ దశలో తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు హైడ్రా ఉనికిని, భవిష్యత్ ని ప్రశ్నార్థకం చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైడ్రాకు విశేష అధికారాలు కల్పించబోతోంది.

హైడ్రా చట్టబద్దమైన సంస్థ అని చెప్పిన కమిషనర్ రంగనాథ్, అక్టోబర్‌ లోపు దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ వస్తుందన్నారు. త్వరలోనే హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయన్నారు. గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలో హైడ్రా పనిచేస్తుందని, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని ఆయన అన్నారు. రెండు వారాల తర్వాత హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆలోగా ప్రభుత్వం హైడ్రాకు పక్కాగా అధికారాలు కట్టబెట్టేందుకు నిర్ణయించింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...