YouTube channel subscription banner header

టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు.. కీలక అప్ డేట్

Published on

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఆన్ లైన్ బుకింగ్ కి సంబంధించి టీడీపీ కీలక ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈనెల 18 – బుధవారం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది. బుధవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌ లో కోటా విడుదల చేస్తున్నట్టు తెలిపింది. సేవా టికెట్ల లాటరీ విధానం కోసం సెప్టెంబరు 20 ఉదయం 10గంటల వరకు ఆన్‌ లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లాటరీలో టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వతేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలని, అలా చేసిన వారికే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు అధికారులు.

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు సెప్టెంబరు 21న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి డిసెంబరు నెల కోటా సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3గంటలకు విడుదలవుతుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటా 23న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి డిసెంబరు నెల కోటా ఆన్‌లైన్‌లో ఈనెల 23న ఉదయం 11 గంటలకు విడుదలవుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని తెలిపారు అధికారులు. ఇక డిసెంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

డిసెంబర్ నెల దర్శనాలతోపాటు, వసతికోసం వచ్చేవారికి గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆయా తేదీలలో ఆన్ లైన్ లో అలర్ట్ గా ఉన్నవారికే టికెట్లు దొరుకుతాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...