ప్రజలకు 35 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 540 సేవలను అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చారు అదే వలంటీర్ వ్యవస్థ. గతంలో మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా..పెన్షన్ రావాలన్నా కూడా అధికారుల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయినప్పటికీ మన పట్ల కనికరం ఉండేది కాదు, పెన్షన్ కోసం లంచం ఇచ్చి అధికారులను ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఉంటేది.
ఈ బాధలను ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఈ సమస్యలకు పరిష్కారంగా వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో వలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టి, ప్రజల గడప వద్దకు పాలనను చేరువ చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పనిలేదు, ప్రభుత్వ పథకాలన్నీ ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా అనుకున్న సమయానికి మా వద్దకు చేరుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు. ఆధార్ కార్డు నుంచి మొదలుకొని బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఓటర్ కార్డ్, ఇన్కమ్ ఇలా మనకు అవసరమైన ఏ పని అయినా వలంటీర్ ఇంటికి వచ్చి ఆ సేవలను అందిస్తున్నారు.
ఇక జగన్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షేమ పథకాలకు మధ్యలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా అర్హుల ఖాతాలోకే డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కూడా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించేందుకు మాత్రమే వాటి ఏర్పాటు జరిగింది. ఫలితాలను ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం ఇవి ఎంతో విజయవంతంగా మారిపోయాయి.
ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా మారడంతో ఈ వ్యవస్థను కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా వలంటీర్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా కరోనా సమయంలో వలంటీర్ల పనితీరుకు ప్రతి ఒక్కరు కూడా సలాం కొట్టాల్సిందే. ఇలా జగన్ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా తిరిగి ఆయనకే మద్దతు తెలపడానికి సిద్ధమవుతున్నారు.