పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీ తీసుకుంది. కానీ బలమైన అభ్యర్థిగా భావించిన వరదాపురం సూరిని పక్కనపెట్టి సత్యకుమార్ కు టికెట్ ఇచ్చారు. ఇందుకు కారణం పరిటాల కుటుంబమేనని సూరి భావిస్తున్నారు. అందుకే ఆయన రాప్తాడులో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అనుచరులు మాత్రం లేదు ధర్మవరంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెబుతున్నారు.