YouTube channel subscription banner header

నెల రోజుల్లో వైసీపీలోకి 250 మంది కూటమి నేతలు

Published on

బస్సు యాత్రతో సీఎం జగన్‌ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు. యాత్ర తర్వాత వైసీపీ బలగం పెరిగిపోయింది. కీలక కూటమి నేతలు కూడా అధికార పార్టీలో చేరేందుకు ఆరాట పడుతున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ ఏకపక్షమే­నని.. వైఎస్సార్‌సీపీ విజయం లాంఛనమేనని స్పష్టం అవుతోంది. 35 రోజుల్లో ఏకంగా 250 మంది కీలక కూటమి నేతలు వైసీపీలో చేరారు. లక్షా 5 వేల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు అధికార పార్టీలోకి వచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమికి గట్టి డ్యామేజ్ అయింది. గోదావరి జిలాల్లోనూ జనసేనను జగన్ యాత్ర ఊడ్చేసింది.

తాజాగా ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో పలువురు కీలక నేతలు చేరారు. గాజువాక నియోజకవర్గం బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్‌రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు. పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...