YouTube channel subscription banner header

దళితులు అంటే బాబుకు ఎప్పుడు చిన్న చూపే.. దళిత నేతను అవమానించిన బాబు!

Published on

చంద్రబాబు నాయుడుకు దళితులు అంటే చాలా చిన్న చూపు అనే సంగతి మనకు తెలిసిందే. ఎన్నో సందర్భాలలో ఆయన దళితుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఓ బహిరంగ సభలో అయితే ఎస్సీ కులంలో పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్యల పట్ల చాలా మంది దళితలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి దళిత నేతను చంద్రబాబు నాయుడు ఘోరంగా అవమానించారు.

ఇటీవల సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ప్రజాగళం నిర్వహించిన చంద్రబాబు ఆ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీసీ అభ్యర్థి మన్నె పాక వీరాంజనేయులు పట్ల అవహేళనగా మాట్లాడారు. సింగనమల నియోజకవర్గం వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చారని హేళనగా మాట్లాడారు.

టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే వేలిముద్రలు వేయించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశాడు.. నువ్వు చాలా గొప్పోడయ్యా జగన్ అంటూ హేళనగా మాట్లాడారు. ఇలాంటి ఐడియాలు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి శభాష్ అంటూ తానేదో గొప్పగా మాట్లాడానని భావించారు. కానీ, చంద్రబాబుకు తెలియని విషయం ఏమిటంటే టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులు ఏకంగా పీజీ కూడా పూర్తి చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబుకు తెలియకపోవటం గమనార్హం.

ఇలా ఒక దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు ఇంత చులకనగా మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలపై వీరాంజనేయులు స్పందించారు. చంద్రబాబు పార్టీ పెత్తందారుల పార్టీ, వారి పార్టీలో కేవలం కోటీశ్వరులు మాత్రమే ఉంటారు. కానీ మా పార్టీ పేదవారి పార్టీ, ఇక్కడ మాలాంటి వారికి అవకాశాలు కల్పిస్తారు. తాను ఒక ఎస్సీగా పుట్టినా.. సింగనమల ప్రజలకు సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి కల్పించారని, అందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలు బీసీలు అంటే ఎప్పటికీ చిన్నచూపే అంటూ వీరాంజనేయులు ఘాటుగా రిప్లై ఇవ్వడమే కాకుండా తన మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లను కూడా చూపించారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...