YouTube channel subscription banner header

వైసీపీ 8వ జాబితా విడుదల

Published on

రానున్న ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల జాబితాలను వరుసగా విడుదల చేస్తున్న వైసీపీ ఇప్పటివరకు 7 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి 8వ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు ఇన్‌చార్జిలను ప్రకటించింది.

వైసీపీ ప్రకటించిన తాజా జాబితాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలకు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ జాబితాను విడుదల చేసినట్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఆ ప్రకటనలో వెల్లడించింది.

తాజా జాబితాలో పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యను గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు ఎంపీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రక‌టిస్తూ జాబితా విడుదల చేసింది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కిలారి రోశయ్య స్థానంలో అంబటి మురళికి అవకాశం కల్పించింది. ఇక కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బుర్రా మధుసూదన్‌ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కల్లత్తూర్‌ కృపాలక్ష్మిలను సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...